చిత్రం : పరుగు 
సంగీతం : మణిశర్మ 
పాడినవారు : సాకేత్  
లిరిక్స్ : అనంత శ్రీరామ్ 
***********************
పల్లవి : 
నమ్మవేమో గాని అందాల యువరాణి 
నేలపై వాలింది నా ముందే విరిసింది..
నమ్మవేమో గాని అందాల యువరాణి 
నేలపై వాలింది నా ముందే విరిసింది..
అందుకే అమాంతం నా మది అక్కడే - నిశ్శబ్దం ఐనది.. 
ఎందుకో ప్రపంచం అన్నది.. ఇక్కడే ఇలాగే నాతో ఉంది 
నిజంగా కళ్లతో వింతగా మంత్రమేసింది 
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది 
నిజంగా కళ్లతో వింతగా మంత్రమేసింది 
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది..
చరణం 1: 
నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే 
చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే 
చూపులు తేనె ధారాలై అల్లుకుపోతుంటే 
రూపం ఏడు వారాలై ముందర నించుంటే 
ఆ సోయగాన్ని నే చూడగానే ఓ రాయి లాగా అయ్యాను నేనే 
అతివ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా.. 
నిజంగా కళ్లతో వింతగా మంత్రమేసింది 
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది 
 నిజంగా కళ్లతో వింతగా మంత్రమేసింది 
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది 
చరణం 2: 
వేకువలోన ఆకాశం ఆమెను చేరింది 
ఓ క్షణమైనా అధరాల రంగును ఇమ్మంది 
వేసవి పాపం చలివేసి ఆమెను వీడింది 
శ్వాసలలోన తలదాచి జాలిగ కూర్చుంది  
ఆ అందమంతా నా సొంతమైతే - ఆనందమైన వందేళ్ళు నావి 
కలల తాకిడిని మనసు తాళదిక వెతికిచూడు చెలిని..
నిజంగా కళ్లతో వింతగా మంత్రమేసింది 
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
నిజంగా కళ్లతో వింతగా మంత్రమేసింది 
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
Friday, May 14, 2010
Subscribe to:
Post Comments (Atom)
 
 
 
 
 
 
 
 
 
 

 
No comments:
Post a Comment