కొన్ని గాయాలను కాలమే మానుపుతుంది అనుకుంటాం.. కానీ ఆ గాయం తాలూకు నొప్పి మనం ఉన్నంత వరకూ మనతోనే ఉంటుంది.. అప్పటివరకూ భరించవలసిందే..! 
అవును.. మనసుకి తగిలిన గాయాలను కాలమే మానుపుతుంది అని బలంగా విశ్వసిస్తాం. కానీ అన్నివేళలా అది నిజం అవదు. కొన్ని గాయాలు మనసు లోపలి పొరలవరకూ వెళ్ళి ఉంటాయి. వాటి తాలూకు నొప్పి ఇంకా పచ్చిగానే ఉంటుంది. అది వారి వారి గాయాల తాలూకు తీవ్రతని బట్టి ఉంటుంది. ఇలాంటి గాయాలను కాలం మానపలేదు. కారణం - ఆ గాయాల తాలూకు నొప్పి మనతో(లో) ఇంకా ఉన్నందువల్లనే. ఎప్పుడైతే ఈ గాయాల తాలూకు నొప్పి దూరం చేసుకుంటామో / మరచిపోతామో అప్పుడే మనసుకి ప్రశాంతత లభించదు. అంతవరకూ ఆ నొప్పిని భరించవలసిందే.. 

 
 
 
 
 
 
 
 
 
 

 
No comments:
Post a Comment