చిత్రం : మహేష్ ఖలేజా (2010) 
రచన : సీతారామ శాస్త్రి 
సంగీతం : మణిశర్మ 
గానం : హేమచంద్ర, శ్వేత 
********************
సాకీ : 
మీఠీ మీఠీ ధునుప బాజాయే - రాధాకే మన్ కో లుభాయే 
గోపీ బోలే గిరిధర్ నందలాల - నందలాల 
మీఠీ మీఠీ ధునుప బాజాయే - రాధాకే మన్ కో లుభాయే 
గోపీ బోలే గిరిధర్ నందలాల - నందలాల 
గోపీ బోలే గిరిధర్ నందలాల - నందలాలా 
పల్లవి : 
పిలిచే పెదవుల పైనా - నిలిచే మెరపు నువ్వేనా 
పిలిచే పెదవుల పైనా - నిలిచే మెరపు నువ్వేనా 
నువు చేరి నడి ఎడారి - నందనమై విరిసిందా
తనలో ఆనందలహరి - సందడిగా ఎగసిందా 
నడచిన ప్రతిదారి నదిగా మారి - మురిసినదా ముకుందా 
కాలం నేను మరచి జ్ఞాపకాల్లో - జారిపోయిందా 
లోకం గోకులంలా మారిపోయి - మాయ జరిగిందా 
ఊరంతా ఊగిందా - నీ చెంత చేరిందా గోవిందా 
// పిలిచే పెదవుల పైనా - నిలిచే మెరపు నువ్వేనా // 
  
చరణం 1 : 
ఈ భావం నాదేనా - ఈనాడే తోచేనా 
చిరునవ్వోటి పూసింది - నా వల్లనా 
అది నావెంట వస్తుంది - ఎటు వెళ్ళినా 
మనసులో ముంచైనా - మురిపించేనా మధురమే ఈ లీల 
నాలో ఇంతకాలం ఉన్న మౌనం - ఆలపించిందా 
ఏకాంతాన ప్రాణం బృందగానం - ఆలకించిందా 
ఊరంతా ఊగిందా - నీ చెంత చేరిందా గోవిందా 
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్ 
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్ (3)
యారో మురళీ భాజావే గిరిధర్ గోపాల 
బజాకే మన్ కో చురాలే గిరిధర్ నందలాల.. 
చరణం 2 : 
నా చూపే చెదిరిందా - నీ వైపే తరిమిందా 
చిన్ని క్రిష్నయ్య పాదాల సిరిమువ్వల 
నన్ను నీ మాయ నడిపింది - నలువైపులా 
అలజడి పెంచైనా అలరించైనా లలనను ఈ వేళ 
ఏదో ఇంద్రజాలం మంత్రమేసి - నన్ను రమ్మందా
ఎదలో వేణుగానం - ఊయలూపి ఊహ రేపిందా 
ఊరంతా ఊగిందా - నీ చెంత చేరిందా గోవిందా 
// పిలిచే పెదవుల పైనా - నిలిచే మెరపు నువ్వేనా // 
Saturday, October 23, 2010
Subscribe to:
Post Comments (Atom)
 
 
 
 
 
 
 
 
 
 

 
1 comment:
ఎంత అద్భుతంగా ఉందండీ పాట!!
Post a Comment