పల్లవి : 
గాంధీ పుట్టిన దేశం - రఘురాముడు ఏలిన రాజ్యం 
ఇది సమతకు మమతకు - సంకేతం 
రఘుపతి రాఘవ రాజారాం 
పతిత పావన సీతారం 
ఈశ్వర్ అల్లా తేరే నాం  
సబ్కో సన్మతి దే భగవాన్ //గాంధీ పుట్టిన // 
చరణం 1: 
భేధాలన్ని మరచి - మోసం ద్వేషం విడచి 
మనిషి మనిషిగా బ్రతకాలి - ఏనాడూ నీతికి నిలవాలి 
బాపూ... ఈ కమ్మని వరమే మా కివ్వు 
అవినీతిని గెలిచే బలమివ్వు // గాంధీ పుట్టిన // 
చరణం 2: 
ప్రజలకు శాంతి సౌక్ష్యం - కలిగించే దేశమే దేశం 
బానిస భావం విడనాడి - ఏ జాతి నిలుచునో అది జాతి 
బాపూ.. - నీ చల్లని దీవెన మాకివ్వు 
నీ బాటను నడిచే బలమివ్వు //గాంధీ పుట్టిన //
Saturday, October 2, 2010
Subscribe to:
Post Comments (Atom)
 
 
 
 
 
 
 
 
 
 

 
No comments:
Post a Comment