చిత్రం : బంగారు పంజరం (1969) 
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి 
సంగీతం : ఎస్. రాజేశ్వర రావ్. బి. గోపాలం 
గానం : ఏ.పి. కోమల. 
**************************
పల్లవి : 
నీ పదములే చాలు రామా! 
నీ పద దూళులే  పదివేలు // నీ పదములే చాలు // 
చరణం 1: 
నీ పదమంటిన పాదుకులు 
మమ్మాదుకొని ఈ జగమేలు 
నీ ఆయ గౌతమి గంగా - రామయ 
నీ దాసులు మునుగంగా 
నా బ్రతుకోక నావ 
దానిని నడిపే తండ్రివి నీవా // నీ పదములే చాలు //   
చరణం 2: 
కోవెల లోనికి రాలేను. 
నువు కోరిన కనుక తేలేను. 
నిను గానక నిమిషము మనలేను 
నువు కనపడితే నిను కనలేను // నీ పదములే చాలు //   
Wednesday, September 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
 
 
 
 
 
 
 
 
 
 

 
No comments:
Post a Comment